Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపూర్‌ విరిగిపడిన కొండ చరియలు - 37కు చేరిన మృతులు

Webdunia
సోమవారం, 4 జులై 2022 (09:54 IST)
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌ రాష్ట్రంలోని నోనీ జిల్లాలో రైలు మార్గం నిర్మాణ పనులు జరుగుతున్న చోట కొండ చరియలు విరిగిపడ్డాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 37కు చేరింది. 
 
జిరిబమ్‌-ఇంఫాల్‌ మార్గంలో తుపుల్‌ రైల్వే యార్డు వద్ద జరిగిన ఈ ఘటనలో ఇంకా 25 మంది కోసం అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు. అయితే వర్షాలు ఈ గాలింపు చర్యలకు అడ్డంకిగా మారుతున్నాయి. ప్రమాదం జరిగి నాలుగు రోజులు ముగుస్తుండటంతో ఆచూకీ లభించని వారంతా మృతి చెందివుంటారని అధికారులు ప్రాథమికంగా నిర్ధరించుకున్నట్లు తెలుస్తోంది.
 
శిథిలాల కింద నుంచి ఇప్పటివరకు 37 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని, వారిలో 24 మంది టెరిటోరియల్ ఆర్మీ సిబ్బంది, 13 మంది పౌరులు ఉన్నారని గౌహతిలోని రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు. ఆచూకీ లభించని ఆరుగురు జవాన్లు, 19 పౌరుల కోసం గాలిస్తున్నామని, చివరి వ్యక్తి దొరికేవరకు చర్యలు కొనసాగుతాయన్నారు. 
 
ప్రతికూల వాతావరణం, భారీ వర్షాలు ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నట్లు తెలిపారు. సైనిక బృందాలు, అస్సాం రైఫిల్స్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇప్పటివరకు 13 మంది జవాన్లను, ఐదుగురు పౌరులను సహాయక సిబ్బంది రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments