Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబులెన్స్‌కు నిప్పంటించిన దుండగులు.. ముగ్గురి సజీవదహనం!

Webdunia
గురువారం, 8 జూన్ 2023 (09:43 IST)
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో చెలరేగిన అల్లర్లు, ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రెండు తెగల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు కారణంగా ఈ రాష్ట్రం ఘర్షణలతో అట్టుడికిపోతుంది. ఈ పరిస్థితుల్లో అక్కడ ఒక హృదయ విదారక ఘటన జరిగింది. కొందరు దుండగులు ఓ ఎనిమిదేళ్ల బాలుడు, అతడి తల్లి, వారి బంధువు నిండు ప్రాణాలను బలిగొన్నారు. 
 
పశ్చిమ ఇంఫాల్‌లోని ఇరోసింబా ప్రాంతంలోని ఓ శరణార్థుల శిబిరం సమీపంలో ఆదివారం మెయితీ - కుకీ వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ బులెట్ వచ్చి బాలుడు తాన్సింగ్ (8) తలలోకి దూసుకెళ్లింది. దీంతో హుటాహుటిన సిబ్బంది.. ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రత్యేక అంబులెన్లోకి ఎక్కించారు. 
 
తోడుగా బాలుడి తల్లి మీనా, లైడియా అనే వారి బంధువు వాహనంలోకి ఎక్కారు. అంబులెన్స్ ఆస్పత్రికి వెళుతుండగా ఓ దుండగుల మూక అడ్డుకొని ఆ వాహనానికి నిప్పు పెట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్ పూర్తిగా దహనమైంది. డ్రైవర్ తప్పించుకోగా.. వాహనంలో బాలుడు, అతడి తల్లి, వారి బంధువు సజీవ దహనమయ్యారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments