Webdunia - Bharat's app for daily news and videos

Install App

Manipur: మణిపూర్‌ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి

సెల్వి
గురువారం, 15 మే 2025 (08:44 IST)
Manipur
మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో బుధవారం అస్సాం రైఫిల్స్ యూనిట్‌తో జరిగిన కాల్పుల్లో కనీసం పది మంది మిలిటెంట్లు మరణించారని భారత సైన్యం తెలిపింది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. "ఇండో-మయన్మార్ సరిహద్దు సమీపంలోని చందేల్ జిల్లా ఖెంగ్‌జోయ్ తహసీల్, న్యూ సమతాల్ గ్రామం సమీపంలో సాయుధ కేడర్ల కదలికలపై నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా, స్పియర్ కార్ప్స్ ఆధ్వర్యంలోని అస్సాం రైఫిల్స్ యూనిట్ 2025 మే 14న ఆపరేషన్ ప్రారంభించింది" అని ఆర్మీ కమాండ్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో తెలిపింది. వారి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. 
 
ఇదిలా ఉండగా, మణిపుర్​లోని ఉఖ్రుల్​ జిల్లాలో వచ్చే వారం నుంచి ఐదు రోజుల పండుగ జరగనుంది. ఈ సందర్భంగా కుకీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి మైతేయిలు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ హెచ్చరికను తంగ్ఖుల్​ నాగ సామాజిక కార్యకర్త అసంగ్ కాషర్ ఖండించారు. ఇది మణిపుర్‌లోని ప్రతి పౌరుడికి ప్రత్యక్షంగా ఒక సవాలు అని, దీనివల్ల వారు (కుకీలు) శాంతికి వ్యతిరేకంగా ఉన్నారని అర్థమవుతోందన్నారు.
 
మరోవైపు, మణిపుర్​లో జాతుల మధ్య వైరం కొనసాగుతోంది. మే 2023 నుంచి జరిగిన జాతి ఘర్షణల వల్ల దాదాపు 260మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments