Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలికి నుదుట రక్తందిద్ది మరీ హత్య చేసిన ప్రియుడు...

Webdunia
ఆదివారం, 21 జులై 2019 (12:31 IST)
తనను నెలల తరబడి ప్రేమించి, చివరకు పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన ప్రియురాలిని ప్రియుడు హతమార్చాడు. పైగా, ప్రియురాలి నుదుట కుంకుమదిద్ది మరీ హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీకి చెందిన అరుణ్ గుప్తా (21), ముంబైకి చెందిన ప్రతిభా ప్రసాద్‌కు యేడాది క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్యా పరిచయం ఏర్పడటంతో అది తొలుత స్నేహం, ఆ తర్వాత ప్రేమగా మారింది. దీంతో తనను పెళ్ళి చేసుకునేందుకు తనతో రావాలంటూ ప్రియుడు కోరారుడు. కానీ, ఆ ప్రియురాలు మాత్రం ససేమిరా అన్నది. దీంతో ప్రియుడు ఆగ్రహించాడు. 
 
ఈ క్రమంలో వారణాసికి వెళుతున్నానని ఇంట్లో చెప్పిన అరుణ్ గుప్తా, ముంబైకి వచ్చి, కల్యాణ్‌లోని ఓ గెస్ట్ హౌస్‌లో గదిని అద్దెకు తీసుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం గదిలోకి వెళ్లిన వీరిద్దరూ శనివారం సాయంత్రం వరకు బయటకు రాలేదు. దీంతో లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చి తలుపులు కొట్టినా తీయలేదు. 
 
ఆ తర్వాత పోలీసులు వచ్చి చూడగా, ఇద్దరూ విగతజీవులై పడివున్నారు. బ్లేడ్‌తో తన చేతికి గాయం చేసుకుని, ఆమె నుదుటన సింధూరంలా దిద్ది, సెల్ఫీలు దిగి, ఆపై ప్రతిభను గొంతుపిసికి హత్య చేసిన అరుణ్, సీలింగ్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో చౌర్య పాఠం విడుదల చేస్తున్నాం : త్రినాథరావు నక్కిన

జూ.ఎన్టీఆర్ ధరించిన షర్టు ధర రూ.85 వేలా?

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా కిచ్చా సుదీప్ తో బిల్లా రంగ బాషా ప్రారంభం

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments