Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూటర్ రిపేర్ చేయలేదని ఓలా షారూమ్‌కు నిప్పుపెట్టిన యువకుడు (Video)

ఠాగూర్
బుధవారం, 11 సెప్టెంబరు 2024 (18:53 IST)
కర్నాటక రాష్ట్రంలో మొరాయించిన బైకును రిపేరు చేయలేదన్న కోపంతో ఓ యువకుడు ఏకంగా ఓలా షారూమ్‌కు నిప్పుపెట్టాడు. ఈ స్కూటర్‌ను కూడా పక్షం రోజుల క్రితమే కొనుగోలు చేశాడు. అంతలోనే సాంకేతిక సమస్య తలెత్తడంతో రిపేరు కోసం షోరూమ్‌కు ఇచ్చాడు. అయితే, షోరూమ్ సిబ్బంది సరిగా స్పందించకపోవడంతో ఆగ్రహించిన ఓ యువకుడు.. షోరూమ్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈఘటన కర్నాటక రాష్ట్రంలోని కలబుర్గిలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కలబుర్గి పట్టణంలోని ఓలా షోరూమ్‌లో మహ్మద్ నదీమ్ అనే యువకుడు స్కూటర్ కొనుగోలుచేశాడు. అందులో మూడు వారాల తర్వాత సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో నదీమ్ తన స్కూటర్‌ను ఓలా షోరూమ్‌కు తీసుకెళ్లాడు. 
 
అయితే, షోరూమ్ సిబ్బంది సరిగా స్పందించలేదంటూ ఆ యువకుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో షోరూమ్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో షోరూమ్‌లోని ఆరు స్కూటర్లు దగ్ధమైపోయాయి. 
 
షోరూమ్ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. నదీమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఓలా షోరూమ్ తగలబడుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments