Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేటు వయస్సులో దాని కోసం రెండో పెళ్ళి చేసుకున్నాడు..

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (16:23 IST)
ఓ తండ్రి లేటు వయస్సులో తన ముర్ఖత్వపు ఆలోచనతో రెండో పెళ్లి చేసుకుని, మొదటి భార్యను, అలాగే పిల్లలను పట్టించుకోవడం మానేసాడు. నాగరికత అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనూ, ఆర్థికంగా స్థిరపడిన కుటుంబాలలో కూడా ఆడపిల్లల పట్ల చిన్నచూపు కొనసాగుతోంది. 
 
కర్ణాటకలోని బెళగావి తాలూకా కాకతి గ్రామానికి చెందిన బాళెగౌడ లేటు వయస్సులో తనకు ఉన్న దుర్బుద్ధిని బయటపెట్టాడు. బాళెగౌడ పాటిల్‌కి 25 ఏళ్ళ క్రితం మహాదేవి అనే మహిళతో పెళ్లైంది. ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు. కుమారుడు చిన్న వయస్సులోనే మరణించాడు. పెద్ద కుమార్తెకు ఇటీవలే వివాహం చేసాడు. అదే గ్రామంలో పాటిల్ తన భార్య ఇద్దరు కూతుళ్లతో కలిసి జీవిస్తున్నాడు.
 
బాగా సాఫీగా సాగుతున్న జీవితంలో అతనికి ఏం దుర్బుద్ది పుట్టిందో ఏమో కానీ వారసుడు కావాలని మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య పిల్లలను పట్టించుకోవడం మానేసాడు. కొత్త కాపురాన్ని కూడా సొంతూరు నుండి బెళగావికి మార్చేసాడు. కాగా మహాదేవి మాత్రం నర్సు ఉద్యోగం చేస్తూ కూతుళ్లను చదివిస్తోంది. 
 
అమ్మాయిల చదువు, కుటుంబ పోషణ ఆమెకు భారంగా మారింది. ఇదే క్రమంలో ఆ ఇద్దరు కూతుళ్లు తండ్రిని తీసుకురావడానికి అతడు ఉంటున్న ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడం చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారు. గ్రామస్తులు కూడా అమ్మాయిలకు మద్దతుగా నిలిచారు. కుటుంబాన్ని వీధిపాలు చేసిన బాళెగౌడకు బుద్ధి చెప్పాలని పోలీసులను డిమాండ్ చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments