Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్క్‌పై మత్తు చల్లి... మైనర్ బాలికపై బలాత్కారం... ఎక్కడ?

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (08:52 IST)
అభంశుభం తెలియని మైనర్లు కూడా కామాంధుల కంబంధ హస్తాల్లో నలిగిపోతున్నారు. ఈ కామాంధులు ఆటలు కట్టించేందుకు ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితంగా మాత్రం శూన్యంగానే ఉంది. తాజాగా ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. అదీకూడా.. కరోనా వైరస్ సోకకుండా ముఖానికి ధరించే మాస్కుపై మత్తు చల్లి... ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ రాష్ట్రానికి చెందిన ఓ లేబర్ కాంట్రాక్టర్... తన వద్ద పని చేసే ఓ మైనర్ బాలికపై కన్నేశాడు. అందుకే.. ఆమెకు ఓ కొత్త మాస్క్ కొనిచ్చాడు. ఈ ఫేస్‌మాస్కుపై మత్తు చల్లి, దాన్ని ఆమెకిచ్చాడతను. విషయం తెలియని మైనర్ బాలిక.. ఆ మాస్కు వేసుకుంది. 
 
ఆ తర్వాత స్పృహతప్పింది. ఆ సమయంలో సదరు కాంట్రాక్టర్ ఆమెను బలాత్కరించాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడట. ఈ విషయం చెప్పి బాధితురాలు భోరుమంది. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు కాంట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments