Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యాయస్థానంలోనే భార్యను గొడ్డలితో హత్య చేశాడు.. ప్రేమించి పెళ్లి చేసుకుని?

న్యాయాన్ని పరిరక్షించే న్యాయస్థానంలోనే హత్య చోటుచేసుకుంది. కోర్టులోనే భార్యను భర్త గొడ్డలితో నరికి హతమార్చాడు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని సంబల్ పూర్ జిల్లా సింధూర్‌ పం

Webdunia
మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (11:29 IST)
న్యాయాన్ని పరిరక్షించే న్యాయస్థానంలోనే హత్య చోటుచేసుకుంది. కోర్టులోనే భార్యను భర్త గొడ్డలితో నరికి హతమార్చాడు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని సంబల్ పూర్ జిల్లా సింధూర్‌ పంక్‌ గ్రామానికి చెందిన రమేష్‌ కంవార్‌, సంగీత చౌదరి (37)ని ప్రేమించి ఆరునెలల క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లికి తర్వాత వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. 
 
తరచూ గొడవలు జరిగేవి. దీంతో భర్తనుంచి విడాకులిప్పించాలని సంగీత సంబల్ పూర్ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల ప్రకారం దంపతులిద్దరూ కౌన్సిలింగ్‌కు హాజరయ్యారు. వారికి న్యాయమూర్తులు కౌన్సిలింగ్ చేస్తుండగా, ఇద్దరి మధ్య మాటామాట పెరిగి వాగ్వివాదం చోటుచేసుకుంది. 
 
దీంతో భార్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన రమేష్ గొడ్డలితో భార్య, ఆమె తల్లి లలిత, ఆమె అక్క కుమార్తె శివాని (4)పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సంగీతను న్యాయమూర్తులు బుర్లా ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ చికిత్స పొందుతూ సంగీత మృతి చెందింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments