Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొక్కు తీర్చుకునేందుకు అమ్మవారికి యువకుడిని బలిచ్చిన తండ్రి... ఎక్కడ?

Webdunia
శనివారం, 16 జులై 2022 (16:35 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రెవా జిల్లాలో సర్‌మౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ముగ్గురు అమ్మాయిల తర్వాత పుట్టిన మగబిడ్డ కోసం ఓ వ్యక్తి పొరుగు గ్రామానికి చెందిన యువకుడుని బలిచ్చాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
రాంలాల్ ప్రజాపతి అనే వ్యక్తి తన భార్యతో కలిసి సర్‌మౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నాడు. ఈ దంపతులకు వరుసగా ముగ్గురు అమ్మాయిలు జన్మించారు. అయితే, కొడుకు పుట్టాలని ప్రజాపతి ఎన్నో దేవుళ్లకు మొక్కుకున్నారు. 
 
తనకు నాలుగో సంతానంగా కుమారుడు పుడితే ఓ యువకుడిని బలిస్తానని అమ్మవారికి మొక్కుకున్నాడు. యాదృచ్ఛికంగానే వారికి నాలుగో కుమారుడుగా కుమారుడు జన్మించాడు. తాను అమ్మవారిని ప్రార్థించడం వల్లే కుమారుడు పుట్టాడని ప్రజాపతి బలంగా నమ్మాడు. 
 
దీంతో తన మొక్కును తీర్చుకునేందుకు ఓ యువకుడి కోసం గాలించాడు. చివరకు పొరుగు గ్రామానికి చెందిన 19 యేళ్ల యువకుడికి మాయమాటలు చెప్పి తన వెంట తీసుకెళ్ళాడు. 
 
అదే రోజు రాత్రి తన గ్రామంలో అమ్మవారి ఆలయంలో యువకుడిని పదునైన ఆయుధంతో పొడిచి చంపాడు మరుసటి రోజు ఉదయం యువకుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
దీంతో పోలీసులు గ్రామానికి చేరుకుని యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే రాంలాల్ ప్రజాపతిని కూడా అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments