Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలు కోరిక తీర్చలేదని బిడ్డను కిడ్నాప్ చేశాడు....

ప్రియురాలు కోరిక తీర్చలేదని కుమారుడిని కిడ్నాప్ చేశాడు ఓ తాగుబోతు. వివరాల్లోకి వెళితే.. చెన్నై కొరుక్కుపేట కామరాజర్‌ నగర్‌కు చెందిన మునియప్పన్‌ (30) భార్య సరస్వతి(26)తో విభేదాలు రావటంతో మూడేళ్ల క్రితం

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2017 (14:45 IST)
ప్రియురాలు కోరిక తీర్చలేదని కుమారుడిని కిడ్నాప్ చేశాడు ఓ తాగుబోతు. వివరాల్లోకి వెళితే.. చెన్నై కొరుక్కుపేట కామరాజర్‌ నగర్‌కు చెందిన మునియప్పన్‌ (30) భార్య సరస్వతి(26)తో విభేదాలు రావటంతో మూడేళ్ల క్రితం భార్య, ఇద్దరు పిల్లలను వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. కొంతకాలానికి తిరిగొచ్చాడు. ఇంతలో సరస్వతికి అదే ప్రాంతానికి చెందిన ఆనందరాజ్‌(25)తో సంబంధం ఏర్పడింది. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీన మద్యం మత్తులో వచ్చిన ఆనంద్ రాజ్ సరస్వతిని కోరిక తీర్చమన్నాడు. అందుకు ఆమె నిరాకరించడంతో.. బలవంతపెట్టాడు. దీంతో జడుసుకున్న సరస్వతి కుమార్తెను తీసుకుని బంధువుల ఇంట్లో ఉంచి తిరిగి ఇంటికి వచ్చింది. తిరిగొచ్చేసరికి ఇంట్లో కుమారుడు కనిపించకపోవడంతో ఆర్‌కే నగర్‌ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 
 
పోలీసుల దర్యాప్తులో ఆనంద్ రాజ్ కుమారుడి కిడ్నాప్ చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు అతడి ఇంటి నుంచి చిన్నారిని రక్షించారు. ఆనంద్‌రాజ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments