Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైక్‌తో పాటు బావిలో దూకేసిన వ్యక్తిని రక్షించబోయి.. నలుగురు మృతి

ఠాగూర్
గురువారం, 2 జనవరి 2025 (09:09 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. భార్యతో గొడవపడిన ఓ భర్త.. బైకుతో పాటు బావిలో దూకేశాడు. ఈ విషయం తెలుసుకున్న మరో నలుగురు వ్యక్తులు ఆ వ్యక్తిని రక్షించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. జార్ఖండ్ రాష్ట్రంలోని హజురీబాగ్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. సుందర్ కర్మాలి (27) అనే వ్యక్తి తన భార్య రూపాదేవితో గొడవ పడి కోపంతో ఆత్మహత్య చేసుకోవాలని మోటారు సైకిల్‌ను బావిలోకి పోనిచ్చాడు. సుందర్ కర్మాలి బావిలో పడటంతో అతన్ని రక్షించాలని మరో నలుగురు కూడా బావిలోకి దూకారు. ఈ ఘటనలో సుందర్ కర్మాలితో పాటు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని సబ్ డివిజన్ పోలీస్ అధికారి బీఎన్ ప్రసాద్ మీడియాకు తెలిపారు. 
 
మృతులను రాహుల్ కల్మాలి, వినయ్ కర్మాలి, పంకజ్ కర్మాలి, సూరజ్ భుయాన్‌గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒక వ్యక్తిని కాపాడబోయి నలుగురు మృతి చెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments