Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తుల గొడవ.. సోదరుడి కుమార్తెపైనే సామూహిక అత్యాచారం.. కిడ్నాప్ చేసి స్నేహితులతో?

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (23:11 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వావి వరుసలు లేకుండా వయోబేధాలు లేకుండా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తాజాగా వరుసకు చిన్నాన్న పగతో సోదరుడి కుమార్తెపై తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. 
 
స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆస్తుల గొడవలో సొంత సోదరుడి కుమార్తె పైనే అత్యాచారం చేయించిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. ఈ ఘటన ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... బాధిత బాలిక వయస్సు 15 సంవత్సరాలు. కెదువా గ్రామానికి చెందిన చెనారామ్ అనే వ్యక్తి బాలికను తన సోదరుడి మీద పగతో కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెను నాలుగు రోజులపాటు ఆమెను తీవ్రంగా హింసించాడు. దీంతో బాలిక అనారోగ్యానికి గురైంది. తనను తన తండ్రి వద్ద వదిలేయాలని బాలిక బ్రతిమిలాడింది. సరేనన్న చెనారామ్‌.. ఆమెను బైక్‌పై పై ఎక్కించుకుని బాలిక గ్రామానికి బయలుదేరాడు. 
 
మార్గమధ్యంలో తన స్నేహితులను పిలిపించి, ఓ చెరువు వద్ద ఆమెపై సామూహిక అత్యాచారం చేయించాడు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. బాలిక తండ్రికి ఈ విషయం తెలియడంతో అతను పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. తమ నేరాన్ని అంగీకరించారు. దీనికి సహకరించిన చెనారామ్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

ఆ కోలీవుడ్ దర్శకుడుతో సమంతకు రిలేషన్? : దర్శకుడు భార్య ఏమన్నారంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments