మద్యం మత్తులో ఉడుకుతున్న అంబలి డబ్రాలో పడిన వ్యక్తి (వీడియో వైరల్)

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (15:40 IST)
Sambar
తమిళనాడు, మదురైలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉడుకుతున్న అంబలిలో ఓ వ్యక్తి పడిపోయాడు. అంతే తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. మధురైలోని పలంగానట్టిలో చోటుచేసుకుంది. పలంగానట్టిలో గ్రామ దేవత ఉత్సవాల్లో ఈ విషాదం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... గ్రామ దేవత ఉత్సవాల్లో భాగంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాని కోసం వంటలు చేస్తుండగా ఆ ప్రాంతానికి మద్యం సేవించి ముత్తు కుమార్ అనే వ్యక్తి వచ్చాడు. అప్పటికే పీకల దాకా మద్యం మత్తులో మునిగి వున్నాడు. వెనుక నుంచి అంబలి డబ్రాలో పడిపోయాడు. 
 
మత్తులో ఉన్న ఆయనకు అది అంబలి డాబ్రాలోని వేడి కూడా తగలలేదు. పూర్తిగా ఆ డబ్రా మీదికి ఒరిగేసరికి, లేవడానికి ప్రయత్నించినా వీలు కాలేదు. పక్కనే ఉన్న వంటలు చేస్తున్న వ్యక్తి పాటు చాలామంది అతడిని బయటికి తీయడానికి ప్రయత్నించారు. 
 
ఆ వేడి కారణంగా నరకయాతన అనుభవించాడు. అతడిని బయటికి తీయడానికి కాళ్లు, చేతులు, జుట్టు పట్టుకుని లాగారు. కానీ ప్రయత్నం విఫలమైంది. చివరకు ఏమీ చేయలేక అంబలి డబ్రాను గట్టిగా నెట్టేశారు. 
 
ఆ డబ్రా కింద పడటంతో ఆ వ్యక్తి బయటపడ్డారు. కానీ అప్పటికే చాలా గాయాలయ్యాయి. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ ఆస్పత్రికి తరలిస్తుండగానే ముత్తుకుమార్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఈ దుర్ఘటనకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.  ఈ వీడియో మీ కోసం.. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments