Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 రోజులే టైమ్.. నోట్ల రద్దును వెనక్కి తీసుకోలేదో అంతే సంగతులు: మమత వార్నింగ్

పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తృణమూల్ చీఫ్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. మోడీ ప్రజల వ్యతిరేకి అని.. ప్రస్తుతం దేశంలో ఆర్థిక అత్యవసర స్థితి నడుస

Webdunia
గురువారం, 17 నవంబరు 2016 (15:46 IST)
పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తృణమూల్ చీఫ్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. మోడీ ప్రజల వ్యతిరేకి అని.. ప్రస్తుతం దేశంలో ఆర్థిక అత్యవసర స్థితి నడుస్తుందన్నారు. పెద్ద చేపలను రక్షించేందుకే మోడీ పెద్ద నోట్లను రద్దు చేశారని ఆరోపించారు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా గురువారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని అజాద్‌పూర్ మండీలో నిర్వహించిన ర్యాలీలో మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా మమత మోడీని ఏకిపారేశారు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసిన లిక్కర్ కింగ్ విజయమాల్యా విదేశాలకు పారిపోవడంలో మోడీ సహకారం ఉందని దుయ్యబట్టారు. మూడు రోజుల్లో నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే గాలి కుమార్తె వివాహానికి వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని మమతా బెనర్జీ అడిగారు. గాలి కుమార్తె వివాహంపై ఎందుకు దర్యాప్తు చేయలేదని మమత ప్రశ్నించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments