Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహానికి ముందే కౌన్సెలింగ్ : కేరళ మహిళా కమిషన్

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (12:54 IST)
కేరళ మహిళా కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గృహ హింస, వరకట్న వేధింపులు, వివాహితులపై దాడులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దాంపత్య బంధానికి అధికారిక గుర్తింపు పొందాలంటే వధూవరులు ఇకపై తప్పనిసరిగా ప్రి వెడ్డింగ్‌ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించింది. 
 
అంతేకాదు వివాహ రిజిస్ట్రేషన్‌ సమయంలో ఈ కౌన్సెలింగ్‌కు హాజరైనట్లు సంబంధిత ధ్రువ పత్రం సమర్పిస్తేనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముందుకు సాగుతుందని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో కేరళ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. గృహహింస, వరకట్న వేధింపల కేసులు భారీగా నమోదవుతున్నాయి. 
 
ముఖ్యంగా ఉత్రా కేసు(పాముతో భార్యను చంపించిన సంఘటన), విస్మయ (వరకట్న వేధింపలతో ఆత్మహత్య చేసుకున్న మెడికల్‌ స్టూడెంట్‌) కేసులు దేశంలో సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే ప్రి వెడ్డింగ్‌ కౌన్సెలింగ్‌ ను అమల్లోకి తీసుకొస్తున్నట్లు కేరళ మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ సతీదేవి తెలిపారు. దాంపత్య బంధంలో ఉండే సాధక బాధకాలను ఈ కౌన్సెలింగ్‌లో వధూవరులకు వివరించనున్నట్లు ఆమె పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments