Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవును జాతీయ జంతువుగా ప్రకటించండి.. గోవధ చేస్తే జీవితఖైదు: రాజస్థాన్ హైకోర్టు

గోవధ, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షలపై కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో నిరసన గళాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్రానికి స

Webdunia
బుధవారం, 31 మే 2017 (17:22 IST)
గోవధ, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షలపై కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో నిరసన గళాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. అంతేగాకుండా గోవధ చేసేవారికి ప్రస్తుతం మూడేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తున్నారని గుర్తు చేసింది. ఇంకా ఆవును చంపితే జీవితఖైదు విధించాలని రాజస్థాన్ హైకోర్టు కేంద్రానికి సిఫారసు చేసింది. 
 
పశువులను వధ కోసం కొనకుండా, అమ్మకుండా కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధంపై మద్రాస్ హైకోర్టు ఇప్పటికే నాలుగు వారాలు స్టే విధించిన తరుణంలో రాజస్థాన్ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీసింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తాము పట్టించుకునే ప్రసక్తే లేదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళ, త్రిపుర కూడా పశ్చిమ బెంగాల్ బాటలోనే నడుస్తున్నాయి.
 
పశువుల వధపై నిషేధం విధించిన విషయంపై దాఖలు అయిన పిటిషన్లను బుధవారం రాజస్థాన్ హైకోర్టు విచారించింది. రాజస్థాన్ రాజదాని జైపూర్ లో విచ్చలవిడిగా గో మాంసం విక్రయిస్తున్నారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్నతరువాత ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments