Webdunia - Bharat's app for daily news and videos

Install App

గగనతలంలో విమానం కుదుపులు.. 17 మందికి గాయాలు

Webdunia
సోమవారం, 2 మే 2022 (10:51 IST)
దేశంలోని ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటైన స్పైస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. గగనతలంలో ఈ విమానం భారీ కుదుపులకు లోనైంది. దీంతో విమాన ప్రయాణికుల్లో 17 మందికి గాయాలయ్యాయి. వీరిలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం జరిగింది. ముంబై నుంచి వెస్ట్ బెంగాల్‌లోని దుర్గాపూర్‌కు బయలుదేరిన స్పైస్ జెట్ విమానం బోయింగ్ బి737లో జరిగింది. 
 
ఈ విమానం దుర్గాపూర్ ఎయిర్‌పోర్టుకు చేరుకునే ముందు ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. ఈ కుదుపుల కారణంగా లగేజీ క్యాబిన్ తలుపులు కూడా తెరుచుకుని, అందులోని లగేజి ప్రయాణికులపై పడింది. వాతావరణం సరిగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ హఠాత్‌పరిణామంతో ప్రయాణికులందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇక ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు స్పైస్ జెట్ సంస్థ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments