Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మను ఆంటీ అని పిలిచింది.. పళనిస్వామి బదిలీ వేటు వేశారు.. ఆమె ఎవరో తెలుసా?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చాలా సన్నిహితురాలైన.. ఆమెను ఆంటీ అని పిలిచే విద్యాశాఖ కార్యదర్శి, ఐఏఎస్ సబితపై బదిలీ తప్పలేదు. ఎంతమంది ఐఏఎస్ అధికారులను వేరే శాఖలకు బదిలీ చేసినా.. సబిత మాత్రం విద్

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (11:48 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చాలా సన్నిహితురాలైన.. ఆమెను ఆంటీ అని పిలిచే విద్యాశాఖ కార్యదర్శి, ఐఏఎస్ సబితపై బదిలీ తప్పలేదు. ఎంతమంది ఐఏఎస్ అధికారులను వేరే శాఖలకు బదిలీ చేసినా.. సబిత మాత్రం విద్యాశాఖ కార్యదర్శిగానే తిరుగులేకుండా.. అమ్మ ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆరేళ్ల పాటు ఆమె విద్యాశాఖ కార్యదర్శిగానే కొనసాగారు. 
 
అయితే పళనిస్వామి ప్రభుత్వం కొలువుదీరాక ఎట్టకేలకు ఆమెపై బదిలీ వేటు తప్పలేదు. అయితే ఈ వేటు వెనుక విద్యాశాఖ మంత్రి సెంగొట్టయన్ ఒత్తిడి ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యానాథన్‌పై ఒత్తిడి తీసుకొచ్చి సబితాను సిమెంట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శాఖకు బదిలీ చేశారు. సబితపై కాకుండా మొత్తం 17మంది ఐఏఎస్‌లను వేరే శాఖలకు బదిలీ చేస్తూ పళనిస్వామి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
 
ఇకపోతే జయలలిత సీఎం కుర్చీలో ఉన్నన్ని రోజులు.. సబిత దర్జాగా ఉన్నారని టాక్. మిగతా అధికారులంతా జయలలితను మేడమ్ అని సంబోధిస్తే.. సబిత మాత్రం 'ఆంటీ' అని పిలిచేవారు. దీన్నిబట్టి జయలలితకు ఆమె వద్ద ఎంత చనువు ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు జయలలిత పాల్గొనే కార్యక్రమాల్లోను సబితా సందడి చేసేవారు. అయితే పళనిస్వామి వచ్చాక సబితపై బదిలీ వేటు వేశారు. ఇలా అమ్మ ఆశయాలను నెరవేరుస్తామని పదవిలో కూర్చున్న పళనిస్వామి చిన్నమ్మ ఆదేశాల మేరకే సబితపై వేటు వేశారని రాజకీయ పండితులు అంటున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments