Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం కోసం రూ.5,500 కోట్లు ఖర్చుపెట్టారట.. ఓటు ధర రూ.2వేలు?

ఎన్నికలంటేనే డబ్బు కుమ్మరించుకోవాల్సిందేనని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో డబ్బు బాగా కుమ్మరిస్తే ఓటర్లు ఓట్లేసేస్తారని.. రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా..

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2017 (16:50 IST)
ఎన్నికలంటేనే డబ్బు కుమ్మరించుకోవాల్సిందేనని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో డబ్బు బాగా కుమ్మరిస్తే ఓటర్లు ఓట్లేసేస్తారని.. రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా.. నిజాయితీగా జరిగితే ప్రజలకు, ప్రజా సేవకులకు మేలు జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే డబ్బు లేనిదే ఎన్నికలు జరగదని.. యూపీ ఎన్నికలు మరోసారి నిరూపించాయి.

నోట్లు రద్దయ్యాక కూడా యూపీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రచారం కోసం రూ.5,500 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎంఎస్ సర్వేలో వెల్లడైంది. ఈ మొత్తంలో రూ.వెయ్యి కోట్లు ఓటుకు నోటుకోసమే ఖర్చు చేశారని తెలిసింది. ఒక్కో ఓటు విలువ సగటున రూ.750 అని తెలిపింది. పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లో ఒక్క ఓటు పడటం కోసం రాజకీయ పార్టీ రూ.2వేలు ఇచ్చి ఓటును కొనుగోలు చేసినట్లు సీఎంఎస్ సర్వేలో వెల్లడి అయ్యింది. మూడింట ఒక వంతు మంది ఓటర్లు నగదు లేదా మద్యం స్వీకరించి, ఓటు వేశారని, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి రూ.25 లక్షలు మాత్రమే ఖర్చు చేయవలసి ఉంటుంది. 
 
అయితే వారు చేసిన ఖర్చులో ఈ 25 లక్షల రూపాయలు సముద్రంలో నీటి బొట్టులాంటిదని తేలిపోయింది. ప్రచార కార్యక్రమాల్లో సాంకేతిక పరికరాలు, ఓటర్లు భారీగా డబ్బు పంచి పెట్టడం, మద్యం, బిర్యానీ ప్యాకెట్లు, దుస్తులు పంపిణీ చేయడంతో భారీ మొత్తాన్ని రాజకీయ పార్టీలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. వీడియో వ్యాన్లు, భారీ తెరలను బహిరంగంగా పెట్టి ప్రచారం చేశారు. ఈ విధంగా చేసిన ప్రచారానికి రాజకీయ పార్టీలు దాదాపు రూ.600 కోట్ల నుంచి రూ.900 కోట్ల వరకు ఉంటుందని సీఎంఎస్ సర్వేలో తేలింది.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments