Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణి చితిలో బంగారం.. ఆ నలుగురు దొంగలు ఏం చేశారంటే?

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (13:12 IST)
గర్భిణి కాష్టంలోని బూడిదలో బంగారు నగల అవశేషాలను దొంగిలించడానికి ప్రయత్నించి నలుగురు నిందితులు అడ్డంగా దొరికిపోయారు. గ్రామస్తులు వారిని పట్టుకుని, దేహశుద్ధి చేసి పోలీసులకు పట్టించారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..  సోలాపూర్‌ జిల్లా బర్లోని గ్రామానికి చెందిన దాదాసాహెబ్‌ హన్వంతే, రుక్మిణి, రామచంద్ర కస్బే, స్వాతిలు తమ ఉద్యోగాలు కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 22న గ్రామానికి చెందిన ఓ గర్భిణి మరణించింది. అయితే, కుటుంబసభ్యులు ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను అలాగే ఉంచి అంత్యక్రియలు చేయాలని నిర్ణయించారు. ఈ విషయం ఊరంతా తెలియడంతో నిందితులు నలుగురు ఆ నగలను కాజేసేందుకు ప్లాన్ చేశారు. గర్భిణి అంత్యక్రియల తర్వాత బూడిదలో నుంచి బంగారాన్ని దొంగిలించాలనుకున్నారు. అనుకున్నట్లుగానే బుధవారం అర్థరాత్రి మృతురాలి బూడిదలోని నగల కోసం వెళ్లారు.
 
అయితే, వారు బూడిదలో బంగారం కోసం వెతుకుతుండగా గ్రామస్తులు గమనించారు. అది చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితులను వెంబడించి పట్టుకున్నారు. అందరూ కలిసి వారిని తీవ్రంగా కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments