ట్రాన్స్ జెండర్స్‌కి ఉచిత విద్య.. పాఠశాల ఏర్పాటు

Webdunia
మంగళవారం, 29 జూన్ 2021 (15:28 IST)
Transgender
మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని వాసాయిలో ట్రాన్స్ జెండర్స్‌కి ఉచిత విద్యను అందించేందుకు పాఠశాలను ఏర్పాటు చేశారు. ట్రాన్స్ జెండర్స్ సమాజంలో అక్షరాస్యత చాలా తక్కువగా ఉంది. వారు ఎక్కడికైనా వెళ్లి చదువుకోవాలి అంటే అనేక రకాల ఇబ్బందులు. వీటిని దృష్టిలో ఉంచుకొని ఓ ఎన్జీవో ముందుకు వచ్చి వీరి కోసం పాఠశాలను నిర్మించింది. ఇక ఇప్పటి వరకు ఈ పాఠశాలలో పెద్దలు, పిల్లలు కలిసి 25 మంది జాయిన్ అయినట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు.
 
ఇక ఈ విషయంపై ట్రాన్స్ జండర్స్ మీడియాతో మాట్లాడారు. తమకు చదువుకోవాలని ఉన్నా పాఠశాలకు వెళ్లలేకపోతున్నామని, తమకు పాటలు చెప్పేందుకు ఎవరు ముందుకు రావడం లేదని తెలిపారు. తమ బాధలని ఓ ఎన్జీవోకి తెలిపామని వారు తమకోసం పాఠశాల ఏర్పాటు చేశారని వివరించారు. ఈ పాఠశాలలో వయసుతో సంబంధం లేకుండా ట్రాన్స్ జెండర్స్ ఎవరైనా వచ్చి చదువుకోవచ్చని తెలిపారు.
 
ఎన్జీవో వ్యవస్థాపకులు, చైర్‌పర్సన్ రేఖా త్రిపాఠి మాట్లాడుతూ.. లింగభేదం లేకుండా అందరికి విద్యను అందించాలని తెలిపారు. ఆలా అందించినప్పుడే సమాజంలో అందరికి గౌరవం దక్కుతుందని తెలిపారు. చాలా చోట్ల ట్రాన్స్ జెండర్స్‌ని పాఠశాలలోకి రానివ్వడం లేదని వారిని చిన్న చూపుచూస్తున్నారని తెలిపారు. ఇకపై అనేక చోట్ల ఇటువంటి పాఠశాలలు ప్రారంభిస్తామని వివరించారు. ప్రభుత్వాలు వారికోసం పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ఆమె కోరారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments