Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పతాగి బాత్రూమ్‌లోపడి చనిపోయిన కొడుకు.. బతికున్నాడని రాత్రంతా తల్లి సేవలు...

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (11:17 IST)
మహారాష్ట్రలో ఓ విషాదకర ఘటన వెలుగు చూసింది. తప్పతాగడం వల్ల బాత్రూమ్‌లో పడిన కన్నబడ్డ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలియని అతని తల్లి.. రాత్రంతా శవం పక్కనే కూర్చొని సపర్యలు చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముంబై మహానగరంలోని కలినా ఏరియాకు చెందిన 42 ఏళ్ల వ్యక్తి సోమవారం తాగిన మైకంలో బాత్‌రూంలో జారికిందపడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
కొద్దిసేపటి తర్వాత బాత్‌రూం దగ్గరకు వెళ్లిన తల్లి.. కుమారుడు కదలిక లేకుండా పడి ఉండటాన్ని గమనించింది. అనంతరం అతడ్ని(శవం)బయటకు లాక్కువచ్చింది. అతడు బ్రతికే ఉన్నాడని భావించింది. తల​కైన గాయానికి పసుపు రాయటం మొదలుపెట్టింది.
 
రాత్రంతా శవానికి సపర్యలు చేస్తూ కూర్చుంది. అయితే మరుసటి రోజు ఉదయం కూడా కుమారుడు లేవకపోవటంతో బంధువులకు విషయం చెప్పింది. దీంతో వారు అక్కడికి వచ్చి, పోలీసులకు సమాచారం అందించారు. 
 
పోలీసులు బాధితుడ్ని ఆసుపత్రికి తరలించగా.. అతడు చాలా సేపటి క్రితమే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రాథమిక దర్యాప్తు మేరకు ప్రమాదవశాత్తు సంభవించిన మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments