Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో డోసు టీకా వేసుకున్న వ్యక్తి శరీరంలో అయస్కాంత శక్తులు!

Webdunia
ఆదివారం, 13 జూన్ 2021 (15:35 IST)
కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు వీలుగా కరోనా వ్యాక్సిన్లు వేయించుకోవాలని పదేపదే కోరుతున్నారు. అయితే, కరోనా రెండో డోసు వేసుకున్న వారి శరీరంలో సరికొత్త మార్పులు కనిపిస్తున్నాయి.
 
ఇటీవల మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన అరవింద్ సోనార్ అనే వ్యక్తికి కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం అయస్కాంత శక్తులు వచ్చాయన్న ఘటన సంచలనం సృష్టించింది. 
 
ఇప్పుడా ఘటన మరువక ముందే ఉల్హాస్ నగర్‌కు చెందిన మరో వ్యక్తి కరోనా టీకా రెండో డోసు తీసుకున్న అనంతరం అయస్కాంత శక్తులు వచ్చినట్టు చెబుతుండడం మరింత ఆసక్తి కలిగిస్తోంది.
 
ఆ వ్యక్తి పేరు శాంతారాం చౌదరి. తనకు అయస్కాంత శక్తులు వచ్చినట్టు నిరూపించడానికి ఓ వీడియో కూడా విడుదల చేశాడు. అందులో ప్లేట్లు, స్పూనులు, నాణేలు అతడి శరీరానికి అయస్కాంతంలా అతుక్కుపోవడం చూడొచ్చు.
 
దీనిపై శాంతారాం చౌదరి మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల నాసిక్ వ్యక్తి కరోనా టీకా తీసుకున్న తర్వాత అయస్కాంత శక్తులు పొందిన వైనం మీడియా ద్వారా తెలుసుకున్నానని వెల్లడించాడు. 
 
తాను కూడా రెండో డోసు టీకా వేయించుకున్నాక, తనలోనూ అయస్కాంత శక్తులు వచ్చాయేమోనని పరిశీలించానని తెలిపాడు. ప్లేట్లు, స్పూనులు అతుక్కోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని వివరించాడు. దాంతో, తనలోనూ అయస్కాంత శక్తులు వచ్చాయని నిర్ధారించుకున్నట్టు శాంతారాం చౌదరి వెల్లడించాడు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments