Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్మశానంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ప్రేమజంట

Webdunia
గురువారం, 27 జులై 2023 (08:59 IST)
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌ జిల్లాల రహతా గ్రామంలో ఓ ప్రేమ జంట అంగరంగ వైభవంగా పెళ్ళి చేసుకుంది. అయితే, ఈ పెళ్లి కళ్యాణ మండపం లేదా దేవస్థానంలో జరుపుకోలేదు. ఓ శ్మశానవాటికలో జరుపుకుంది. దీనికి కారణం లేకపోలేదు. వధువు తండ్రి ఓ శ్మాశానవాటికలో ఓ కాపరిగా పని చేయడమే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
రహతా గ్రామానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి స్థానికంగా ఉండే శ్మశానవాటికలో కాటికాపరిగా పని చేస్తున్నాడు. ఆయనది మహాసంజోగి సామాజిక వర్గం కూడా. కొన్నేళ్లుగా ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి శ్మశానంలోనే ఉంటున్నారు. గంగాధర్ కుమార్తె మయూరీ శ్మశానంలోనే పుట్టి, పెరిగింది. 12వ తరగతి వరకు చదువుకుంది. 
 
అయితే, ఆమె షిర్డీకి చెందిన మనోజ్ అనే యువకుడిని ప్రేమించింది. ఈ విషయం ఇరుకుటుంబాల పెద్దలకు తెలియడంతో వారంతా కలిసి పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే, మయూరీ పుట్టి పెరిగిన చోటే ఆమె పెళ్లి చేస్తానని గంగాధర్ కోరడంతో ఆ జంట వివాహం శ్మశానంలో బంధువులు స్నేహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments