Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్మశానంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ప్రేమజంట

Webdunia
గురువారం, 27 జులై 2023 (08:59 IST)
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌ జిల్లాల రహతా గ్రామంలో ఓ ప్రేమ జంట అంగరంగ వైభవంగా పెళ్ళి చేసుకుంది. అయితే, ఈ పెళ్లి కళ్యాణ మండపం లేదా దేవస్థానంలో జరుపుకోలేదు. ఓ శ్మశానవాటికలో జరుపుకుంది. దీనికి కారణం లేకపోలేదు. వధువు తండ్రి ఓ శ్మాశానవాటికలో ఓ కాపరిగా పని చేయడమే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
రహతా గ్రామానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి స్థానికంగా ఉండే శ్మశానవాటికలో కాటికాపరిగా పని చేస్తున్నాడు. ఆయనది మహాసంజోగి సామాజిక వర్గం కూడా. కొన్నేళ్లుగా ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి శ్మశానంలోనే ఉంటున్నారు. గంగాధర్ కుమార్తె మయూరీ శ్మశానంలోనే పుట్టి, పెరిగింది. 12వ తరగతి వరకు చదువుకుంది. 
 
అయితే, ఆమె షిర్డీకి చెందిన మనోజ్ అనే యువకుడిని ప్రేమించింది. ఈ విషయం ఇరుకుటుంబాల పెద్దలకు తెలియడంతో వారంతా కలిసి పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే, మయూరీ పుట్టి పెరిగిన చోటే ఆమె పెళ్లి చేస్తానని గంగాధర్ కోరడంతో ఆ జంట వివాహం శ్మశానంలో బంధువులు స్నేహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Shankar: అవతార్ లాగా తన కలల ప్రాజెక్ట్ వేల్పారి చేయబోతున్న తమిళ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments