Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివసేనకు సీఎం... ఎన్సీపీ - కాంగ్రెస్‌లకు డిప్యూటీ సీఎం : ఉద్ధవ్ ఠాక్రే

Webdunia
సోమవారం, 11 నవంబరు 2019 (13:44 IST)
మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ అంగీకరించకపోవడంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. 56 సీట్లు కైవసం చేసుకుని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు మొగ్గు చూపింది. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. 
 
ఇందులోభాగంగా, మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తహతహలాడుతున్న శివసేన ఉన్నతస్థాయి సమావేశం సోమవారం నిర్వహించింది. ఇందులో ముఖ్యమంత్రి పదవిని శివసేనకు, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మరోవైపు, ఈ సమావేశం అనంతరం శివసేన నేతలు పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలో మధ్యాహ్నం గవర్నర్‌తో మరోసారి భేటీ కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మరింత గడువు కావాలని శివసేన గవర్నర్‌ను కోరనున్నది. 
 
ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్యాబలం శివసేనకు లేకపోవడంతో ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. కానీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్.. కాంగ్రెస్‌తో చర్చించాకే తమ నిర్ణయం చెప్తామని వారికి తెలిపారు. దీంతో సందిగ్దంలో పడిన శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు మరింత గడువు కావాలని గవర్నర్‌ను కోరనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం