Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్గా దర్శనానికి వెళ్లి తిరిగివస్తూ... కుటుంబమంతా మృతి

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (13:09 IST)
మహారాష్ట్రలోని నాందేడ్‌లో దారుణం జరిగింది. దర్గా దర్శనానికి వెళ్లి ఇంటికి తిరిగి వెళుతూ ఓ కుటుంబమంతా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృత్యువాతపడ్డారు. ప్రమాదవశాత్తు చెరువులో పడిన తమ వ్యక్తిని రక్షించేందుకు మిగిలివారు కూడా చెరువులోకి ప్రాణాలు కోల్పోయారు. హృదయాన్ని కదిలించే ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఓ కుటుంబం కారులో మహారాష్ట్రలోని నాందేడ్‌ వద్ద ఉన్న ఓ దర్గా దర్శనానికి వెళ్లింది. తమ ఇష్టదైవాన్ని దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో భోజనం చేసేందుకు ఆగారు. కంధర్ చెరువు వద్ద వాహనాన్ని నిలిపారు. ఈ క్రమంలో టిఫిన్ బాక్సును కడిగేందుకు ఒకరు చెరువు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయారు. వెంటనే అప్రమత్తమైన మిగతా కుటుంబ సభ్యులు నీటిలో పడిపోయిన వ్యక్తిని కాపాడేందుకు వెళ్లారు. తొలుత ఇద్దరు వ్యక్తులు నీటిలో దూకారు. 
 
వీరంతా మునిగిపోవడంతో చూసి ఒడ్డున ఉన్న వారిలో ఇద్దరు చెరువులోకి దూకారు. వారు కూడా నీటిలో మునిగిపోవడంతో మరో మరో వ్యక్తి అలా మొత్తం ఐదుగురు చెరువులోకి దిగారు. వారంతా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం కలిగించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments