Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్గా దర్శనానికి వెళ్లి తిరిగివస్తూ... కుటుంబమంతా మృతి

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (13:09 IST)
మహారాష్ట్రలోని నాందేడ్‌లో దారుణం జరిగింది. దర్గా దర్శనానికి వెళ్లి ఇంటికి తిరిగి వెళుతూ ఓ కుటుంబమంతా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృత్యువాతపడ్డారు. ప్రమాదవశాత్తు చెరువులో పడిన తమ వ్యక్తిని రక్షించేందుకు మిగిలివారు కూడా చెరువులోకి ప్రాణాలు కోల్పోయారు. హృదయాన్ని కదిలించే ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఓ కుటుంబం కారులో మహారాష్ట్రలోని నాందేడ్‌ వద్ద ఉన్న ఓ దర్గా దర్శనానికి వెళ్లింది. తమ ఇష్టదైవాన్ని దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో భోజనం చేసేందుకు ఆగారు. కంధర్ చెరువు వద్ద వాహనాన్ని నిలిపారు. ఈ క్రమంలో టిఫిన్ బాక్సును కడిగేందుకు ఒకరు చెరువు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయారు. వెంటనే అప్రమత్తమైన మిగతా కుటుంబ సభ్యులు నీటిలో పడిపోయిన వ్యక్తిని కాపాడేందుకు వెళ్లారు. తొలుత ఇద్దరు వ్యక్తులు నీటిలో దూకారు. 
 
వీరంతా మునిగిపోవడంతో చూసి ఒడ్డున ఉన్న వారిలో ఇద్దరు చెరువులోకి దూకారు. వారు కూడా నీటిలో మునిగిపోవడంతో మరో మరో వ్యక్తి అలా మొత్తం ఐదుగురు చెరువులోకి దిగారు. వారంతా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం కలిగించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments