Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెట్టు దిగిన ఏక్‌నాథ్ షిండే.. బీజేపీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం

ఠాగూర్
బుధవారం, 27 నవంబరు 2024 (17:24 IST)
మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతుంది. బీజేపీ శ్రేణులతో పాటు ఎన్సీపీ నేత అజిత్ పవర్ మాత్రం మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ను సీఎంగా ఎంపిక చేయాలని కోరుతున్నారు. అయితే, శివసేన నేత, ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మాత్రం సీఎం పదవికి కోసం పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం ఓ మెట్టు దిగారు. కొత్త సీఎం అభ్యర్థి ఎంపికలో బీజేపీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడివుంటానని స్పష్టం చేశారు. 
 
కొత్త సీఎం ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలదే తుది నిర్ణయమన్నారుప. వారు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. మహాయుతికి చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టిన మహారాష్ట్ర ఓటర్లకు మరోసారి ధన్యవాదాలు తెలిపిన ఆయన.. తన దృష్టిలో సీఎం అంటే కామన్‌ మ్యాన్‌ అని అన్నారు.
 
'మహాయుతికి చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టిన మహారాష్ట్ర ఓటర్లకు మరోసారి ధన్యవాదాలు. ఎన్నికల సమయంలో తెల్లవార్లు పనిచేశా.. రోజుకు రెండు మూడు గంటలు మాత్రమే నిద్రపోయా. ఒక కార్యకర్తలా చెప్పులరిగేలా తిరిగా.. నా దృష్టిలో సీఎం అంటే కామన్‌ మ్యాన్‌. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను.. కష్టాలన్నీ తెలుసు. మహిళలు, రైతులు ఇలా అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు తీసుకొచ్చాం. సీఎంగా ఎటువంటి అసంతృప్తి లేదు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్‌ షాలు అండగా నిలిచారు. తాజా పరిణామాలపై వారితో ఫోన్‌లో మాట్లాడా. సీఎం ఎంపిక విషయంలో వారు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపాను' అని ఏక్‌నాథ్‌ శిందే పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments