Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతు ఇంట్లో భోజనం.. రాత్రి బస..! ఫడ్నవిస్ ట్వీట్..!

Webdunia
గురువారం, 5 మార్చి 2015 (11:19 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ విదర్భలోని ఒక రైతు ఇంట్లో భోజనం చేసి, ఆ రాత్రి అక్కడే బస చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌లో నమోదు చేశారు. దేశంలో మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు అధికంగా జరుగుతున్నాయన్న విషయం తెలిసిందే. ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతుల సమస్యలు తీరకపోవడంతో మరణాలు మాత్రం ఆగడలేదు.
 
దీంతో రైతుల మరణాలకు గల కారణాలను తెలుసుకునేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నడుంకట్టారు. ఆయన రాష్ట్రంలోని మూడు గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఆ సమయంలో విదర్భలోని 'యవత్ మల్' జిల్లా పింప్రి బూటి గ్రామంలో ముందుగా చనిపోయిన రైతుల భార్యలతో సమావేశమై మాట్లాడారు. 
 
అనంతరం విష్ణుజీ రంగారవు దుమ్నే అనే స్థానిక రైతు ఇంట్లో భోజనం చేసి, ఆ రోజు రాత్రి అక్కడే సీఎం గడిపారని ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదే విషయాన్ని ఫడ్నవిస్ ట్విట్టర్ ఖాతాలో పోస్టుచేసి, రైతు ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు తీసిన ఫొటోలను కూడా ఆయన పోస్టు చేశారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments