Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన ఉద్యోగులకు లాతూర్ జడ్పీ షాక్

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (15:32 IST)
జన్మనిచ్చిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన ఉద్యోగులకు మహారాష్ట్రలోని లాతూర్‌ జడ్పీ ఛైర్మన్‌ షాక్‌ ఇచ్చారు. ఉద్యోగుల వేతనాల్లోంచి 30 శాతం కోత విధించారు. వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతను పట్టించుకోని ఏడుగురు జిల్లా పరిషత్‌ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించినట్టు జడ్పీ ఛైర్మన్‌ రాహుల్‌ బోంద్రే వెల్లడించారు. 
 
తమకు వచ్చిన 12 ఫిర్యాదుల్లో ఆరుగురు ఉపాధ్యాయులే ఉన్నారని ఆయన తెలిపారు. కోత విధించిన మొత్తాన్ని వారి తల్లిదండ్రుల ఖాతాల్లోకే బదిలీ చేసినట్టు చెప్పారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలన్న ప్రతిపాదనను గతేడాది నవంబర్‌లో జడ్పీ జనరల్‌ బాడీ ఆమోదించగా.. డిసెంబర్‌ నుంచి నెల జీతంలో కోత ప్రారంభమైందని ఆయన వివరించారు. 
 
ప్రతి నెలా వారి వేతనంలో 30శాతం కోత కొనసాగుతుందని, సగటున ఇది రూ.15 వేలు దాకా ఉంటుందని తెలిపారు. తాము నోటీసులు పంపిన తర్వాత కొన్ని కేసుల్లో ఉద్యోగులు, వారి తల్లిదండ్రులు పరస్పరం సమస్యను పరిష్కరించుకున్నారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments