Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన ఉద్యోగులకు లాతూర్ జడ్పీ షాక్

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (15:32 IST)
జన్మనిచ్చిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన ఉద్యోగులకు మహారాష్ట్రలోని లాతూర్‌ జడ్పీ ఛైర్మన్‌ షాక్‌ ఇచ్చారు. ఉద్యోగుల వేతనాల్లోంచి 30 శాతం కోత విధించారు. వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతను పట్టించుకోని ఏడుగురు జిల్లా పరిషత్‌ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించినట్టు జడ్పీ ఛైర్మన్‌ రాహుల్‌ బోంద్రే వెల్లడించారు. 
 
తమకు వచ్చిన 12 ఫిర్యాదుల్లో ఆరుగురు ఉపాధ్యాయులే ఉన్నారని ఆయన తెలిపారు. కోత విధించిన మొత్తాన్ని వారి తల్లిదండ్రుల ఖాతాల్లోకే బదిలీ చేసినట్టు చెప్పారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలన్న ప్రతిపాదనను గతేడాది నవంబర్‌లో జడ్పీ జనరల్‌ బాడీ ఆమోదించగా.. డిసెంబర్‌ నుంచి నెల జీతంలో కోత ప్రారంభమైందని ఆయన వివరించారు. 
 
ప్రతి నెలా వారి వేతనంలో 30శాతం కోత కొనసాగుతుందని, సగటున ఇది రూ.15 వేలు దాకా ఉంటుందని తెలిపారు. తాము నోటీసులు పంపిన తర్వాత కొన్ని కేసుల్లో ఉద్యోగులు, వారి తల్లిదండ్రులు పరస్పరం సమస్యను పరిష్కరించుకున్నారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments