Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాథమిక విద్యను బోధించని మదర్సాలకు నిధులు కట్ : మహారాష్ట్ర సర్కారు

Webdunia
గురువారం, 2 జులై 2015 (17:28 IST)
మహారాష్ట్ర ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక విద్యను బోధించని మదర్సాలకు ప్రభుత్వం అందించే నిధులను అందించబోమని ఆ రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖామంత్రి ఏక్‌నాథ్ ఖాడ్సే స్పష్టం చేశారు. మహారాష్ట్రలో అధికారిక లెక్కల ప్రకారం 1,889 మదర్సాలు ఉండగా, వాటిలో 1.48 లక్షల మందికి పైగా చిన్నారులు ఉన్నారు. మదర్సాలలో ఇంగ్లీషు, గణితం, సైన్స్, సోషల్ వంటి సబ్జెక్టుల బోధన తప్పనిసరి చేయాలని 'మహా' సర్కారు కిందటి నెలలో నిర్ణయించింది. దీనిపై విమర్శలు చెలరేగాయి. 
 
అయినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇంగ్లీషు, గణితం, సైన్స్, సోషల్ వంటి సబ్జెక్టులను బోధించని మదర్సాలకు గుర్తింపు ఉపసంహరించాలని నిర్ణయించింది. ఆ సబ్జెక్టులు బోధించని మదర్సాలను పాఠశాలలుగా పేర్కొనలేమని, వాటిలో ప్రాథమిక విద్యను బోధిస్తున్నట్టు కనిపించడంలేదని తెలిపింది. ఈ క్రమంలో జులై 4న రాష్ట్రంలో ఉన్న అన్ని మదర్సాలను పరిశీలించాలని నిర్ణయించింది. కాగా, ఒక్కో మదర్సాకు ప్రభుత్వం యేడాదికి రూ.5.50 లక్షల చొప్పున నిధులు ఇస్తోంది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments