Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరబ్బాయిలతో ఇద్దరమ్మాయిల ప్రేమకథ : తండ్రికి తెలిసి ఆత్మహత్య

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (13:54 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సియోని జిల్లాలో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు అదే గ్రామానికి చెందిన ఇద్దరు అబ్బాయిలతో ప్రేమలోపడ్డారు. ఈ ప్రేమ వ్యవహారం అమ్మాయిల తండ్రికి తెలిసింది. దీంతో ఆ ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్‌ సియోని జిల్లాలోని కొంద్రా గ్రామానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు. ఒకరి వయసు 18.. మరొకరి వయసు 16. వారిద్దరు ఇద్దరు యువకులతో ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. వారిలో ఒకమ్మాయి ప్రేమికుడు ఆమె తండ్రికి తాజాగా ఓ మెసేజ్‌ పంపి, తాను ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాడు. 
 
దీంతో తమ కూతుళ్ల ప్రేమ వ్యవహారం గురించి ఆ తండ్రికి తెలిసిపోయింది.. వారిద్దరిని పెద్దలు మందలించారు. తాము అబ్బాయిలను ప్రేమిస్తున్న విషయం ఇంట్లో తెలిసిపోవడంతో ఆ అక్కాచెల్లెళ్లిద్దరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని, ఓ బావి వద్దకు వెళ్లి అందులో దూకారు. 
 
బావిలో వారు దూకిన విషయాన్ని తెలుసుకున్న ఆ అక్కాచెల్లెళ్ల కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చి, మృతదేహాలను బావిలోంచి బయటకు తీశారు. అమ్మాయి తండ్రికి మేసేజ్‌ పంపిన ప్రేమికుడి‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ అక్కాచెల్లెళ్ల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు తీసుకున్నామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments