Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంచం డబ్బుతో అడ్డంగా దొరికిన ఉద్యోగి.. నమిలి మింగేశాడు...

Webdunia
మంగళవారం, 25 జులై 2023 (15:47 IST)
ఓ ప్రభుత్వ ఉద్యోగి లంచం డబ్బుతో అడ్డంగా చిక్కాడు. దీంతో ఆ డబ్బులు ఏం చేయాలో తెలియక వాటిని నమిలి మింగేశాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గజేంద్ర సింగ్ అనే ఉద్యోగి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్నీ పట్టణంలో రెవెన్యూ విభాగంలో పని చేస్తున్నాడు. ఓ పని నిమిత్తం ఆయన వద్దకు వచ్చిన వ్యక్తి నుంచి రూ.5 వేలు డిమాండ్ చేశాడు. దాంతో ఆ వ్యక్తి లోకాయుక్తలో ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన అధికారులు గజేంద్ర సింగ్ లంచం తీసుకునేటపుడు రెడ్ హ్యాండెడ్‌గైగా పట్టుకున్నారు. ఈ ఊహించని పరిణామాంతో రెవెన్యూ అధికారి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. 
 
లంచంగా తీసుకున్న డబ్బులు ఏం చేయాలో తెలియక గందరగోళానికి గురయ్యాడు. డబ్బుతో సహా దొరికిపోరాదన్న ఉద్దేశంతో ఒక్కసారిగా వాటిని నోట్లో వేసుకుని నమిలి మింగేశాడు. అతడి ప్రవర్తన చూసి అధికారులు నివ్వెరపోయారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, ఆయన ప్రాణానికి వచ్చిన ముప్పేమి లేదని చెప్పారు. అయినప్పటికీ గజేంద్ర సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments