Webdunia - Bharat's app for daily news and videos

Install App

పులిని పెంచుకుంటా.. అనుమతివ్వండి : మధ్యప్రదేశ్ మహిళా మంత్రి!

Webdunia
సోమవారం, 2 మార్చి 2015 (14:46 IST)
సాధారణంగా మనుషులు తమకు ఇష్టమైన కుక్కలు, పిల్లులు, పక్షులు వంటివి పెంచుకుంటారు. కానీ, మధ్యప్రదేశ్ రాష్ట్ర కేబినెట్‌లో మంత్రిగా ఉంటున్న ఓ మహిళా ప్రజాప్రతినిధికి ఓ వింత ఆలోచన వచ్చింది. అదేంటంటే.. పులిని పెంచుకోవాలన్న ఆశ. అంతే.. ఆమె ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా అటవీశాఖకు దరఖాస్తు చేసుకున్నారు. 
 
ఆ మహిళా మంత్రి పేరు కుసుమ్ మెహ్‌దెలే. థాయ్‌లాండ్ వాసుల తరహాలోనే తానూ ఓ పులిని పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆమె దరఖాస్తు చేసుకున్నారు. అయితే కేంద్రం నుంచి స్పందన రాలేదట. గతేడాది సెప్టెంబరు నెలలో కుసుమ్ రాసిన లేఖను తాజాగా భోపాల్‌కు చెందిన సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు అజయ్ దూబే వెలికితీశారు. 
 
పులులను పెంచుకునే వెసులుబాటు ఉన్న కారణంగా థాయ్‌లాండ్ వంటి దేశాల్లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్న కుసుమ్, మన దేశంలో ఆ తరహా సౌకర్యం లేని కారణంగానే నానాటికీ పులుల సంఖ్య తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
దేశంలో పులుల సంఖ్య తగ్గిపోతోందన్న భావనతోనే కుసుమ్, కేంద్రం చర్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఈ లేఖ రాశారట. ఇదిలావుంటే, ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న పన్నా నియోజకవర్గంలోని అభయారణ్యంలో పులుల సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగిందని అజయ్ దూబే చెబుతున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments