దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

ఐవీఆర్
బుధవారం, 3 డిశెంబరు 2025 (19:00 IST)
బంగారం. దొంగల భయంతో బంగారాన్ని చాలామంది పాతదిండ్లు, మంచాల కింద, బియ్యం డ్రమ్ములు, పాత పుస్తకాల అలమరాలు... ఇలా ఎక్కడైతే పనికిరాకుండా పాతవి వుంటాయో అక్కడ దాచి పెడుతుంటారు. మధురైలో తంగం అనే మహిళ తన కుమార్తె వివాహం కోసం కొనుగోలు చేసిన 25 తులాల బంగారాన్ని జాగ్రత్తగా ఎక్కడ దాచాలా అని ఆలోచించి చివరికి పాత మంచంపైన మట్టిగొట్టుకుపోయి వున్న దిండులో ఆ బంగారాన్ని దాచింది. వివాహం కనుక ఇంటిని శుభ్రం చేయడంతో గంపెడు చెత్త వచ్చింది.
 
ఈ పాత దిండు వెక్కిరిస్తూ కనబడుతుండటంతో దాన్ని కూడా చెత్తతో కలిపి చెత్తబుట్టలో పడేసారు. ఈ విషయాన్ని తంగం గమనించలేదు. ఉదయాన్నే పాత దిండుకోసం వెతుకులాడగా అది కనిపించలేదు. ఏమైందని అడిగితే... దాన్ని చెత్తబుట్టలో పడవేశామని బంధువులు చెప్పారు. విషయం విన్న తంగం ఆందోళనతో చెత్తను తీసుకెళ్లే పారిశుద్ధ్య కార్మికులను సంప్రదించింది.
 
అప్పటికే వారు తమకు దొరికిన ఆ బంగారాన్ని హెల్త్ సూపర్ వైజర్ కి అప్పగించారు. నగల కోసం వచ్చిన తంగంకు సిబ్బంది వాటిని అందజేసారు. తన కుమార్తె కోసం దాచుకున్న నగలు తిరిగి దొరికినందుకు, వాటిని తనకు నిజాయితీతో అప్పగించిన కార్మికులకు తంగం కృతజ్ఞతలు తెలియజేసింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments