Webdunia - Bharat's app for daily news and videos

Install App

జువెలరీ షాపులో దొంగతనం.. గర్భవతి అయినా రిమాండ్..

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (09:07 IST)
చంటి పిల్లాడిని, తమ్ముడిని అడ్డం పెట్టుకుని దొంగతనానికి పాల్పడిన గర్భవతి రిమాండ్ తప్పలేదు. వివరాల్లోకి వెళితే..  రజనీ శర్మ అనే 24ఏళ్ల మహిళ భర్తతో కలిసి ఫతేగఢ్ సాహిబ్ లో నివసిస్తోంది. ఆ జంటకు ఇప్పటికే నాలుగేళ్ల బాబు ఉండగా, ఆమె మరోసారి గర్భం దాల్చింది.

వాళ్లకు సహాయంగా రజనీ తమ్ముడు కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు. మొన్న అక్టోబర్ 9న లూథియానా సిటీకి వచ్చిన రజనీ శర్మ.. ఓ జువెలరీ షాపులో దొంగతనానికి పాల్పడింది. సీసీటీవీ రికార్డుల ఆధారంగా ఫిర్యాదు చేయగా, నాలుగు రోజులు గాలించి ఆమెను పట్టుకున్నారు పోలీసులు.
 
చంటి పిల్లాడిని, తమ్ముడిని అడ్డం పెట్టుకుని రజనీ దొంగతనానికి పాల్పడిన దృశ్యాలు, ఆమె నుంచి రికవరీ చేసిన నగలను సాక్ష్యాలుగా నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. కాగా, తన భర్త రోజు కూలీ అని, అతను తెచ్చిచ్చే డబ్బులతో ఇల్లు గడవటం లేదని, అనివార్య పరిస్థితుల్లోనే జువెలరీ షాపులో దొంగతనం చేయాల్సి వచ్చిందని నిందితురాలు జడ్జిగారికి వివరించింది. 
 
అయితే కోర్టువారు ఈ కథలకు కరిగిపోలేదు. పేదరికాన్ని సాకుగా చెబితే, ఈ దేశంలో నూటికి నలభై మంది పేదలే కదాని ప్రాసిక్యూటర్ వాదించారు. చివరికి ఆమె రిమాండ్ విధించిన కోర్టు.. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రజనీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. ఆమెతోపాటు దొంగతనంలో పాలుపంచుకున్న తమ్ముడిని జువెనైల్ హోంకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం