చనిపోయాడనీ పోస్టుమార్టంకు తరలిస్తుండగా లేచి కూర్చొన్న పోలీస్ ఆఫీసర్.. ఎక్కడ?

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2023 (15:52 IST)
విష పురుగు కుట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఓ పోలీస్ ఆఫీసర్‌లో ఎలాంటి చలనం లేకపోవడంతో ఆయన కుటంబ సభ్యులతో పాటు స్థానికులంతా చనిపోయారని నిర్ధారించుకున్నారు. పైగా, పోలీస్ ఆఫీసర్ కావడంతో మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలిస్తుండగా, ఆయనలో చలనం కనిపించింది. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని లుథియాలో ఇటీవల జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన పూర్తి వివరాలను పరిశీలిస్తే, 
 
మన్‌ప్రీత్ అనే పోలీస్ అధికారిని ఓ విషపు పురుగు కుట్టింది. దీంతో ఆయన అనారోగ్యంపాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన్ను లుథియానాలోని బస్సీ ఆస్పత్రికి తరలించారు. అయితే, శరీరమంతా ఇన్ఫెక్షన్ వ్యాపించడంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 18వ తేదీన అర్థరాత్రి ఆయన మృతి చెందినట్టు ఆసుపత్రి సిబ్బంది తెలిపారని తండ్రి రామ్ చెబుతున్నారు.
 
దీంతో మరుసటి రోజు మన్‌ప్రీత్‌ను పోస్టుమార్టం కోసం తరలిస్తుండగా ఆయన శరీరంలో కదలికలు రావడాన్ని అక్కడే ఉన్న మరో పోలీసు అధికారి గుర్తించారు. వెంటనే ఆయనను మరో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మన్‌ప్రీత్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, తమ ఆసుపత్రిలోని సిబ్బంది ఎవరూ మన్‌ప్రీత్ మరణించినట్టు చెప్పలేదని బస్సీ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది నా రెండో ఇళ్లు.. అక్కడికి వెళ్తే ప్రశాంతంగా వుంటాను.. ఆ కొటేషన్ నన్ను మార్చేసింది..

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments