Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనిపోయాడనీ పోస్టుమార్టంకు తరలిస్తుండగా లేచి కూర్చొన్న పోలీస్ ఆఫీసర్.. ఎక్కడ?

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2023 (15:52 IST)
విష పురుగు కుట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఓ పోలీస్ ఆఫీసర్‌లో ఎలాంటి చలనం లేకపోవడంతో ఆయన కుటంబ సభ్యులతో పాటు స్థానికులంతా చనిపోయారని నిర్ధారించుకున్నారు. పైగా, పోలీస్ ఆఫీసర్ కావడంతో మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలిస్తుండగా, ఆయనలో చలనం కనిపించింది. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని లుథియాలో ఇటీవల జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన పూర్తి వివరాలను పరిశీలిస్తే, 
 
మన్‌ప్రీత్ అనే పోలీస్ అధికారిని ఓ విషపు పురుగు కుట్టింది. దీంతో ఆయన అనారోగ్యంపాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన్ను లుథియానాలోని బస్సీ ఆస్పత్రికి తరలించారు. అయితే, శరీరమంతా ఇన్ఫెక్షన్ వ్యాపించడంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 18వ తేదీన అర్థరాత్రి ఆయన మృతి చెందినట్టు ఆసుపత్రి సిబ్బంది తెలిపారని తండ్రి రామ్ చెబుతున్నారు.
 
దీంతో మరుసటి రోజు మన్‌ప్రీత్‌ను పోస్టుమార్టం కోసం తరలిస్తుండగా ఆయన శరీరంలో కదలికలు రావడాన్ని అక్కడే ఉన్న మరో పోలీసు అధికారి గుర్తించారు. వెంటనే ఆయనను మరో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మన్‌ప్రీత్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, తమ ఆసుపత్రిలోని సిబ్బంది ఎవరూ మన్‌ప్రీత్ మరణించినట్టు చెప్పలేదని బస్సీ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ప్రణయగోదారి లోని సాయికుమార్ లుక్‌

ఆసక్తి రేపుతున్న పౌరుషం - ది మ్యాన్ హుడ్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments