Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారుణం : బ్లడ్ కేన్సర్ బాలికపై అత్యాచారం

బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. బ్లడ్ కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న బాలికపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2017 (15:46 IST)
బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. బ్లడ్ కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న బాలికపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సరోజినీ నగర్‌కు చెందిన 15 యేళ్ళ బాలిక ఒకరు బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతోంది. అయితే, బాలికకు ఆకలిగా ఉండటంతో హోటల్‌కు ఏదైన తినాలని భావించింది. దీంతో తనకు తెలిసిన శుభమ్ అనే వ్యక్తిని హోటల్‌కు తీసుకెళ్లమని ప్రాధేయపడింది. దీంతో రాత్రి 9 గంటల ప్రాంతంలో శుభమ్ ఆ బాలికను తీసుకొని బయటకు బయలుదేరాడు. 
 
వీరితోపాటు శుభమ్ స్నేహితుడు కూడా వచ్చాడు. ఈ ముగ్గురు నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లగానే, ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఇద్దరూ అక్కడ నుంచి పరారయ్యారు. తెలిసిన వ్యక్తి చేతిలో మోసపోయిన ఆమె ఎలాగొలా రోడ్డు వద్దకు చేరుకుంది. 
 
ఆసమయంలో అటుగా వచ్చిన ఓ స్కూటరిస్టును లిఫ్టు అడగ్గా, అతను కూడా ఏమాత్రం కనికరం చూపకుండా ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా ఆరు గంటల వ్యవధిలో ముగ్గురు చేతిలో ఆ యువతి అత్యాచారనికి గురైంది. 
 
చివరికి ఇంటికి చేరుకున్న బాధితురాలు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న శుభమ్, సుమిత్‌ల కోసం గాలిస్తుండగా, రెండోసారి అత్యాచారానికి పాల్పడిన వీరేంద్ర యాదవ్‌ అనే కామాంధుడిని మాత్రం అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments