Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వారంటైన్‌లోనే వివాహం.. ప్రేమికులు అలా ఒక్కటయ్యారు..

Webdunia
గురువారం, 28 మే 2020 (14:53 IST)
ఇద్దరు ప్రేమికులు క్వారంటైన్‌లోనే వివాహం చేసుకున్నారు. కరోనా నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ పెళ్లి వేదికగా మారిపోయింది. ఈ వేదికలో ప్రేమికులిద్దరూ వివాహం చేసుకున్నారు. నిర్వాహకులుగా ఉన్న టీచర్లు, వైద్య సిబ్బంది, ఆశావర్కర్లు పెళ్లి పెద్దలుగా మారిపోయారు. ఈ అరుదైన ఘటన ఒడిశా రాష్ట్రంలోని సాగాడ గ్రామంలో వెలుగుచూసింది. 
 
వివరాల్లోకి వెళితే.. సౌరబ్ దాస్ అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన పింకీరాణినితో ప్రేమలో పడ్డారు. ఇంట్లో చెప్పకుండా ఈ ఏడాది జనవరిలో అహ్మదాబాద్ నగరానికి పారిపోయారు.
 
అక్కడే ఒక ప్లాస్టిక్ పరిశ్రమలో పనిచేస్తూ ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు. లాక్ డౌన్ సమయంలో పరిశ్రమ మూసివేయడంతో ప్రేమికుల జంట ఎంతో కష్టనష్టాలు పడి సాగాడ గ్రామానికి తిరిగివచ్చింది. దీంతో వారిని అధికారులు క్వారంటైన్ చేశారు. 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నతర్వాత క్వారంటైన్ నిర్వాహకులే వారికి వివాహం చేశారు. గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుడు, ఆశా కార్మికుడు, అంగన్ వాడీ వర్కర్లు ఈ ప్రేమ జంటను ఆశీర్వదించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments