Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాందేవ్ ఔషధాల్లో పశువుల ఎముకలు కలిపి అమ్ముతున్నారు: లాలూ

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2015 (14:53 IST)
యోగా గురువు బాబా రాందేవ్‌పై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మాటల తూటాలు పేల్చారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తరపున ప్రచారం చేయబోతున్న బాబా రాందేవ్ ఆర్ఎస్ఎస్ కంటే ప్రమాదకరమని విమర్శించారు. రాందేవ్ ఆర్ఎస్ఎస్‌ను మించి కరుడుగట్టిన హిందుత్వవాది అని లాలూ వ్యాఖ్యానించారు. ఆయన అమ్మే ఔషధాల్లో పశువుల ఎముకలు కలిపి అమ్ముతున్నారని సీపీఎం నేత బృందా కారత్ అన్న విషయాన్ని లాలూ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 
 
అలాంటప్పుడు పశువుల ఎముకలైనా, మనిషి ఎముకలైనా తేడా ఏముందని లాలూ ప్రసాద్ ప్రశ్నించారు. బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. నల్లధనం విషయంలో రాందేవ్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. బాబా సాధువు కాదని, సొంత పనులు చక్కబెట్టుకునే వ్యక్తని విమర్శించారు. రాందేవ్ అమ్ముతున్న మందుల వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని లాలూ డిమాండ్ చేశారు. 
 
కాగా బీహార్ ఎన్నికలు బీఫ్ చుట్టే తిరుగుతున్న సంగతి తెలిసిందే. నిషేధిత మాంసాహారాన్ని తిన్నాడని ఓ ముస్లిం వ్యక్తిని కొట్టి చంపిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని లాలూ, నితీష్ కుమార్‌లు కంకణం కట్టుకున్నారు. ప్రచారంలో భాగంగానే బీజేపీని లాలూ, నితీష్‌ పార్టీలు ఎండగడుతున్నాయి. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments