Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృత్యువుతో పోరాటం : ఓడిపోయిన కెప్టెన్ వరుణ్ సింగ్

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (14:37 IST)
ఇటీవల తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కాట్టేరి ప్రాంతంలో రక్షణ శాఖకు చెందిన హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటనలో తీవ్రంగా గాయపడిన గ్రూపు కెప్టన్ వరుణ్ సింగ్ కన్నుమూశారు. ఎనిమిది రోజుల పాటు బెంగుళూరు ఆస్పత్రిలో మృత్యువుతోపోరాడి చివరకు బుధవారం ప్రాణాలు విడిచారు. 
 
ఈ నెల 8వ తేదీన జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్‌తో పాటు 13 మంది మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదంలో 80 శాతం కాలిన గాయాలతో ప్రాణాలతో బయటపడిన కెప్టెన్ వరుణ్ సింగ్‌ను తొలుత సులూర్ ఆర్మీ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ నుంచి బెంగుళూరులోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ఆయన కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షించారు. 
 
కానీ, ఆయన ఆరోగ్యం విషమించి బుధవారం తుదిశ్వాస విడిచారు. వరుణ్ సింగ్ మృతిపట్ల భారత వైమానిక దళ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వరుణ్ సింగ్ కుటుంబ సభ్యులకు సంతాపన తెలిపింది. వరుణ్ సింగ్ మృతితో ఈ హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 14కు చేరుకుంది. వరుణ్ సింగ్ సొంతూరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దేవరియా జిల్లా వాసి. కెప్టెన్ వరుణ్ సింగ్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments