మృత్యువుతో పోరాటం : ఓడిపోయిన కెప్టెన్ వరుణ్ సింగ్

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (14:37 IST)
ఇటీవల తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కాట్టేరి ప్రాంతంలో రక్షణ శాఖకు చెందిన హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటనలో తీవ్రంగా గాయపడిన గ్రూపు కెప్టన్ వరుణ్ సింగ్ కన్నుమూశారు. ఎనిమిది రోజుల పాటు బెంగుళూరు ఆస్పత్రిలో మృత్యువుతోపోరాడి చివరకు బుధవారం ప్రాణాలు విడిచారు. 
 
ఈ నెల 8వ తేదీన జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్‌తో పాటు 13 మంది మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదంలో 80 శాతం కాలిన గాయాలతో ప్రాణాలతో బయటపడిన కెప్టెన్ వరుణ్ సింగ్‌ను తొలుత సులూర్ ఆర్మీ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ నుంచి బెంగుళూరులోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ఆయన కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షించారు. 
 
కానీ, ఆయన ఆరోగ్యం విషమించి బుధవారం తుదిశ్వాస విడిచారు. వరుణ్ సింగ్ మృతిపట్ల భారత వైమానిక దళ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వరుణ్ సింగ్ కుటుంబ సభ్యులకు సంతాపన తెలిపింది. వరుణ్ సింగ్ మృతితో ఈ హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 14కు చేరుకుంది. వరుణ్ సింగ్ సొంతూరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దేవరియా జిల్లా వాసి. కెప్టెన్ వరుణ్ సింగ్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments