Webdunia - Bharat's app for daily news and videos

Install App

భయపెడుతున్న కరోనా.. హిమాచల్ ప్రదేశ్‌లో లాక్డౌన్

Webdunia
బుధవారం, 5 మే 2021 (17:55 IST)
కరోనా వైరస్ రోజురోజుకూ భయపెడుతోంది. ప్రతి రోజూ నమోదవుతున్న కేసుల సంఖ్యలో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. ఈ వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా, ప్రభుత్వాలు అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. దీంతో లక్డౌన్ విధించే రాష్ట్రాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా హిమాచల్‌ ప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం 10 రోజులపాటు లాక్డౌన్‌ విధించాలని బుధవారం నిర్ణయం తీసుకుంది.
 
ఈ లాక్డౌన్ ఈ నెల 7 నుంచి 16 వరకు అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ అధ్యక్షత బుధవారం అత్యవసర కేబినేట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ మేరకు మంత్రివర్గం లాక్‌డౌన్‌ అమలుకు ఆమోదముద్ర వేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
 
రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం పదోతరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను ఇంటర్కు ప్రమోట్‌ చేసింది. బస్సులు, రైళ్లు, విమానాల్లో ప్రయాణించాలనుకునే వారు 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకొని నెగిటివ్‌ రిపోర్టు వెంట ఉంచుకోవాలని సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments