Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 15 వరకు బీహార్‌లో సంపూర్ణ లాక్డౌన్

Webdunia
మంగళవారం, 4 మే 2021 (14:45 IST)
బీహార్ రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ విధించారు. ఈ నెల 15వ తేదీ వరకు ఈ లాక్డౌన్ అమల్లోవుండనుంది. రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ఈమేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్డౌన్‌ విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. మే 15వ తేదీ వరకు లాక్డౌన్‌ అమలులో ఉంటుందన్నారు. కేబినెట్‌ మంత్రులు, అధికారులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్ చేశారు. 
 
వివరణ్మాతక మార్గదర్శకాలు, ఇతర కార్యాకలాపాలకు సంబంధించి సంక్షోభ నిర్వహణ బృందాన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
 
రాష్ట్రంలో కరోనాను నియంత్రించాలని, లాక్‌డౌన్‌ ప్రకటించాలని పాట్నా హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఇంతకు ముందు ప్రభుత్వం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించింది. 
 
సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కొనసాగుతున్నది. బిహార్‌లో నిన్న ఒకే రోజు 11,407 కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డవగా.. 82 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మొత్తం కేసులు 5.09లక్షలకు చేరగా.. 2,800 వరకు మృత్యువాతపడ్డారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments