Webdunia - Bharat's app for daily news and videos

Install App

చక్రవడ్డీ, ఆలస్య చెల్లింపులపై వడ్డీ విధించొద్దు.. సుప్రీం కోర్టు

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (17:33 IST)
రుణ గ్రహీతలకు కాస్త ఊరటనిచ్చేలా గత ఏడాది విధించిన మారటోరియం కాలానికి ఎలాంటి చక్రవడ్డీ, ఆలస్య చెల్లింపులపై వడ్డీ విధించొద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఒకవేళ ఇప్పటికే బ్యాంకులు అలా వడ్డీ వసూలు చేసి ఉంటే.. ఆ మొత్తాన్ని రుణగ్రహీతలకు తిరిగి చెల్లించడం లేదా సర్దుబాటు చేయాలని సూచించింది. అయితే.. ఆగస్టు 31 వరకు ఉన్న రుణ మారటోరియం కాలాన్ని పొడిగించాలని కేంద్రాన్ని ఆదేశించలేమని స్పష్టం చేసింది. 
 
పూర్తి వడ్డీ మాఫీ చేయమని కూడా చెప్పలేమని కోర్టు పేర్కొంది. కరోనా మహ్మమారిని దృష్టిలో పెట్టుకుని మారటోరియం కాలంలో చక్రవడ్డీ మాఫీ చేయాలని, మారటోరియంను పొడిగించాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన అనంతరం సుప్రీం ఈ తీర్పు వెలువరించింది. ఆర్థిక విధానాల్లో న్యాయపరమైన సమీక్ష చేపట్టలేమని కోర్టు వెల్లడించింది. అలాగే ఇప్పటికే రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీని కేంద్రం మాఫీ చేసిందని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments