విడాకుల కేసులో న్యాయం జరగలేదనీ జడ్జి కారు అద్దాలు పగులగొట్టిన బాధితుడు

Webdunia
గురువారం, 22 జూన్ 2023 (09:11 IST)
విడాకుల కేసులో తనకు న్యాయం జరగలేదని భావించిన ఓ వ్యక్తి .. ఈ కేసులో తీర్పునిచ్చిన ఫ్యామిలీ కోర్టు జడ్జి కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని పథనంతిట్ట జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
విడాకుల కేసులో తనకు న్యాయం జరగలేదని భావించిన ఓ వ్యక్తి న్యాయమూర్తి కారుపై తన అక్రోశం వెళ్లగక్కాడు. కోర్టు ఆవరణలోనే నిలిపివుంచిన కారు అద్దాలను ధ్వంసం చేశాడు. కారుకు సొట్టలు పడేలా చేశాడు. తిరువళ్లా కోర్టు వద్ద బుధవారం ఈ ఘటన వెలుగుచూసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 
 
ఈ కేసు గత ఆరేళ్లుగా కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. భార్యే అతడిపై విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. అయితే, న్యాయవాది, జడ్జి కుమ్మక్కై తన గోడు సరిగా ఆలకించలేదని పేర్కొంటూ కోపోద్రిక్తుడయ్యాడు అని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఈ కేసులో కారు అద్దాలు ధ్వంసం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ ఐ బొమ్మ కుర్రోడి టాలెంట్‌ను టెర్రరిస్టులపై ప్రయోగిస్తే బాగుంటుంది: నటుడు శివాజీ

ఇంకా ఎంతమందితో పెళ్లి చేస్తారు.. వివాహం చేసుకునే ఆలోచన లేదు.. త్రిష

Sai Durgatej: వచ్చే ఏడాదిలో వివాహం ఉంటుందన్న సాయి దుర్గతేజ్

Varanasi: వారణాసి... ఐదు నిమిషాలు నెరేట్ చేశాక నా మైండ్ బ్లాక్ అయింది

Ram : ఆంధ్ర కింగ్ తాలూకా... ఒక రోజు ముందుగానే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments