Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో కిక్కుకి పరాకాష్ట - లిక్కరు బిల్లు రూ.95,347

Webdunia
మంగళవారం, 5 మే 2020 (16:55 IST)
కిక్కు పరాకాష్టకు చేరింది. దీనికి నిదర్శనమే ఓ లిక్కరు బిల్లు ఏకంగా రూ.95347, మరో లిక్కరు బిల్లు రూ.52,841. ఈ రెండు బిల్లులు ఇపుడు నెట్టింట వైరల్ అయ్యాయి. పైగా, ఈ విషయం పోలీసుల దృష్టికి చేరింది. దీంతో ఒకే వ్యక్తికి అధిక మొత్తంలో మద్యం విక్రయించినందుకుగాను వైన్ షాపుపై అబ్కారీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, కేంద్రం ఇచ్చిన సడలింపులతో దేశవ్యాప్తంగా 46 రోజుల తర్వాత మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి. దీంతో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్, కర్నాటక వంటి రాష్ట్రాల్లో కొందరు వేలాది రూపాయలకు మందును కొనుగోలు చేస్తున్నారు. 
 
బెంగుళూరులో వెనిల్లా స్పిరిట్ అనే వైన్ షాపు ఓ వ్యక్తి ఏకంగా రూ.52841 విలువ చేసే మద్యాన్ని కొనుగోలుచేశారు. ఈ తాగుబోతు తానేదో ఘనకార్యం చేసినట్టుగా ఆ బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. 
 
అలాగే, బెంగుళూరుకు చెందిన మరో వ్యక్తి రూ.95347కు మద్యం కొనుగోలు చేసి రికార్డు బ్రేక్ చేశాడు. ఈ రెండు ఘటనల వ్యవహారం ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో రంగంలోకి దిగి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"హరిహర వీరమల్లు"కు పవన్ కళ్యాణ్ - జస్ట్ 4 గంటల్లో డబ్బింగ్ పూర్తి

పవన్ కళ్యాణ్ "ఓజీ" షూటింగుకు మళ్లీ బ్రేక్ ... డెంగ్యూబారినపడిన నటుడు!

బాలు వెళ్లిపోయాక అంతా చీకటైపోయింది ... : పి.సుశీల

Raviteja: వినాయక చవితికి రవితేజ మాస్ జాతార చిత్రం సిద్దం

Gaddar Award : అల్లు అర్జున్, నాగ్ అశ్విన్ లకు బెస్ట్ అవార్డులు ప్రకటించిన గద్దర్ అవార్డ్ కమిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments