Webdunia - Bharat's app for daily news and videos

Install App

#mouseplague యంత్రాల ద్వారా ఎలుకల ఏరివేత (video)

Webdunia
శనివారం, 15 మే 2021 (18:37 IST)
ప్లేగు వ్యాధిని వ్యాప్తి చేయడంతోపాటు పొలాలపై పడి పంటలను నాశనం చేస్తున్న ఎలుకలను పట్టుకునేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌ వేల్స్‌ రాష్ట్రంలో ఎలుకల ద్వారా పంట నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం యంత్రాల ద్వారా ఎలుకల ఏరివేత కార్యక్రమం చేపట్టింది.
 
ఓ రైతు చేసిన విజ్ఞప్తి మేరకు అతడి పొలానికి వెళ్లిన అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. రైతు పొలంలో ఓ గుంత తవ్వగా వేల సంఖ్యలో ఎలుకలు బయటకు వచ్చాయి. 
 
వాటిని ఓ మిషన్‌లో వేసి దూరంగా తీసుకొచ్చి బయటకు వదిలారు.. ఆలా మిషన్ లోంచి వదిలిన సమయంలో ఎలుకలు వర్షంలా కిందకు పడ్డాయి. మరోవైపు ఆస్ట్రేలియాలో ప్లేగు వ్యాధి ప్రబలుతోంది.. ఇది ఎలుకల వల్లనే వ్యాప్తి చెందుతుంది. దీంతో ఎలుకల నివారణకు ప్రభుత్వం నడుంబిగించింది.
 
ఈ క్రమంలోనే అధికారులు పొలాల వద్ద ఎలుకలను నాశనం చేసే పనులు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియా బ్రాడ్‌కాస్టింగ్‌కు చెందిన జర్నలిస్ట్‌ లూసీ థాకరే ట్విటర్‌లో షేర్‌ చేశారు. 'ఎలుకల వర్షం' అంటూ పోస్టు చేసిన ఆ వీడియో వైరల్‌గా మారింది. 
 
వరి కోత మిషన్‌లాగా ఉన్న యంత్రంలోంచి ఎలుకలు బయట పడుతున్నాయి. ఇక ఎలుకల దెబ్బకు గోదాముల్లోని ధాన్యం పాడైపోతుంది. ఎలుకల సంతతి దేశానికే ప్రమాదంగా మారుతుండటంతో వాటి నివారణపై దృష్టి పెట్టింది ప్రభుత్వం

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం