Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిపుల్ తలాక్ బిల్లు రూపకర్తల్లో ఒకరైన నారాయణ రాజు మృతి..

Webdunia
గురువారం, 6 మే 2021 (09:32 IST)
జమ్మూకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, సీఏఏ బిల్లుల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన కేంద్ర న్యాయశాఖ (శాసన) కార్యదర్శి డాక్టర్ జి.నారాయణరాజు మృతి చెందారు. ఆయనకు కరోనా సోకడంతో కన్నుమూశారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. కొవిడ్ బారినపడి ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నారాయణరాజు పరిస్థితి విషమించడంతో మృతి చెందారు.
 
నెల్లూరు జిల్లాకు చెందిన ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చదువుకుని, తొలినాళ్లలో అక్కడే అధ్యాపకుడిగా పనిచేశారు. 2015లో న్యాయశాఖలో చేరిన నారాయణరాజు శాసన వ్యవహారాల కార్యదర్శిగా, జమ్మూకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, సీఏఏ బిల్లుల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు.
 
నారాయణరాజు రెండేళ్ల క్రితం రిటైరయ్యారు. అప్పటికి ఆయన కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌ సభ్యుడిగా పనిచేస్తున్నారు. రిటైర్ అయినప్పటికీ ఆయన సమర్థతను గుర్తించిన కేంద్రం మరో రెండేళ్లపాటు నారాయణరాజు పదవీకాలాన్ని పొడిగించింది. ఆయన మృతికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు సంతాపం తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments