Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడితో సహజీవనం, ఆ తరువాత?

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (21:51 IST)
సాఫీగా సాగిపోతున్న కాపురం, ఇద్దరు పిల్లలు. ఆప్యాయంగా చూసుకునే భర్త. అడిగిన వెంటనే స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. ఇంకేముంది ఫేస్‌బుక్ క్రియేట్ చేసింది. అందులో ఫ్రెండ్స్ అంటూ యాడ్ అయ్యారు. అందులో ఒక యువకుడు చెప్పిన మాయమాటలను నమ్మింది. చివరకు పచ్చటి కాపురాన్ని కూల్చుకోవడమే కాదు తన ప్రాణాన్ని కోల్పోయింది.
 
ఉత్తరప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ జిల్లా చాపియా చెతన్యాకు చెందిన జాకీ అక్తర్ ముంబయిలో వస్త్ర వ్యాపారం చేస్తున్నాడు. అతనికి మూడేళ్ళ క్రితం సిక్కింలోని గ్యాంగ్ చుంక్‌కు చెందిన దవా పస్సీ శెర్పా అనే వివాహిత పరిచయమైంది. ఆమెకు పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
ఇద్దరూ అన్యోన్యంగా ఉండేవారు. కానీ ఫేస్ బుక్ పరిచయం కాస్త చివరకు శెర్పా జీవితాన్ని మార్చేసింది. యువకుడు తన దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయని.. నిన్ను పెళ్ళి చేసుకుంటాను వచ్చేయమంటూ ఫోన్లో పదేపదే చెప్పేవాడు. దీంతో ఆమె నమ్మింది. ముంబైకు వెళ్ళిపోయింది. తన స్నేహితుడి గదిలో ఉంచి రెండు నెలల పాటు ఆమెతో సహజీవనం చేశాడు అక్తర్. అయితే పెళ్ళి చేసుకుందామని శెర్పా పట్టుపట్టింది. కానీ అందుకు అతను ఒప్పుకోలేదు.
 
తన శారీరక వాంఛ తీర్చుకున్న తరువాత ఇక ఆమె అనవసరమనుకున్నాడు. ఎలాగైనా చంపేయాలనుకుని ప్లాన్ చేశాడు. తమ్ముడు సహాయంతో ఆమె గొంతు నులిమి అతి దారుణంగా చంపేసి పరారయ్యాడు. హత్య కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments