Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆపరేషన్ సిందూర్ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు, పోలీసులు 1500 కి.మీ పయనించి లా విద్యార్థిని అరెస్ట్

ఐవీఆర్
శనివారం, 31 మే 2025 (14:09 IST)
ఆపరేషన్ సిందూర్ గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో కూడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణలతో కోల్‌కతా పోలీసులు శుక్రవారం రాత్రి గురుగ్రామ్‌లో పూణే లా విద్యార్థిని శర్మిష్ఠ పనోలిని అరెస్టు చేశారు. అందుకోసం వారు సుమారు 1500 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారు. ఆపరేషన్ సింధూర్ పైన, పహెల్గాం ఉగ్రదాడి నేపధ్యంలో ముస్లిం కమ్యూనిటిపైన ఆమె చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనితో కొంతమంది ఆమెను అత్యాచారం చేస్తామంటూ బెదిరింపు సందేశాలు పంపించారు. 
 
కాగా సదరు యువతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడిన అభ్యంతరకర వీడియో ఆన్‌లైన్‌లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. కోల్‌కతాలో ఎఫ్‌ఐఆర్ నమోదుకు దారితీసింది. పోలీసు వర్గాల ప్రకారం, శర్మిష్ఠ పనోలికి లీగల్ నోటీసులు అందజేయడానికి చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి, కోర్టు అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది.
 
ఎట్టకేలకు జల్లెడ పట్టి ఆమెను గుర్‌గ్రాంలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ తర్వాత పనోలి సోషల్ మీడియాలో బహిరంగంగా క్షమాపణలు చెప్పింది, తాను ఎవరినీ బాధపెట్టాలని ఎప్పుడూ అనుకోలేదని, తన భవిష్యత్ పోస్ట్‌లలో మరింత జాగ్రత్తగా ఉంటానని పేర్కొంది. అధికారులు ఈ విషయంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు, సోషల్ మీడియా చర్చ, ప్రజల మనోభావాలపై దాని ప్రభావంపై పెరుగుతున్న ఆందోళనలను నొక్కి చెబుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments