Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపుడు గడ్డి తిన్నాను సరే... ఇప్పుడు నితీశ్ ఏం తిన్నారు : లాలూ ప్రశ్న

తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను గడ్డితిన్నమాట నిజమేనని ఆర్జేడీ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. బీహార్ రాజధాని పాట్నాలో మరుగుదొడ్ల నిర్మాణం పేరుతో రూ.13.50 కోట్ల నిధులను దోచు

Webdunia
ఆదివారం, 5 నవంబరు 2017 (08:45 IST)
తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను గడ్డితిన్నమాట నిజమేనని ఆర్జేడీ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. బీహార్ రాజధాని పాట్నాలో మరుగుదొడ్ల నిర్మాణం పేరుతో రూ.13.50 కోట్ల నిధులను దోచుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. వీటిపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
ఈ వార్తలపై లాలూ ప్రసాద్ యాదవ్ స్పందిస్తూ, తాను అప్పట్లో గడ్డి తిన్నానని అన్నవాళ్లు ఇప్పుడు నితీశ్ ఏం తిన్నారని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ బీహార్ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. 
 
రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసిన టాయిలెట్ల కుంభకోణాన్ని తన హయాంలో జరిగిన దాణా కుంభకోణంతో పోల్చారు. అప్పట్లో తనను గడ్డి తిన్నారని అందరూ ఆడిపోసుకున్నారని, మరి ఇప్పుడు నితీశ్ ఏం తిన్నారని ప్రశ్నించారు. నితీశ్ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కుంభకోణాల్లో ఇరుక్కుంటుందని జోస్యం చెప్పారు. 
 
కాగా, గత ఎన్నికల్లో ఆర్జేడీతో కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చిన నితీశ్ ఇటీవల ఆర్జేడీకి టాటా చెప్పి బీజేపీని చెంతకు చేర్చుకుని, కమలనాథుల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో నితీశ్, లాలు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు చేరుకున్నాయి. ఫలితంగానే నితీశ్‌పై లాలూ ఘాటైన విమర్శలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments